Monday, December 29, 2014

Mahaneeyudu Manishi

మహనీయుడు మనిషి
Posted On:12/13/2014 1:35:48 AM
షడ్ దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా!
నిద్రా తంద్రా భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రతా॥

మనుషులంతా ఉన్నతంగా బతకాలనీ కోరుకుంటారు. అయితే అభ్యున్నతిని కోరేవారు ముఖ్యంగా ఆరు దోషాలను విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతుంది. నిద్ర, బద్ధకం, భయం, కోపం, అలసత్వం దీర్ఘసూత్రత (ఎటు తెగని ఆలోచన) ఈ ఆరు దోషాలను మనుషులు తమ తమ ఆధీనంలో ఉంచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా వీటిని జయించి కలలను సాకారం చేసుకునే దిశగా జీవితాన్ని సఫలం చేసుకోవాలి.
జీవన పయనంలో ఎత్తుపల్లాలూ, ఆటుపోట్లూ తప్పవు. పరిస్థితులు అందించే అనుకోని అనుభవాలు ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, ఎంతటివారైనా కుంగిపోతారు. నిరాశా నిస్పృహలు అలుముకొని ముభావంగా మా జీవితమే ఇంతని గడుపుతుంటారు. తనకు మించి తాను ఉన్నతంగా లేని మానవుడు హీనస్థితికి చేరుకుంటాడన్న మహానుభావుల అనుభవసారం గుర్తుచేసుకుంటూ ఆశాపూరిత భావాలతో కృషి చేయాలి.
ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మాన మీవ సాదయేత్‌
ఆత్తైవహి ఆత్మనోబంధుః ఆత్తెవరిపురాత్మనః॥

మానవుడు తనను తానే ప్రోత్సహించుకోవాలి. ఉద్ధరించుకోవాలి. ఎన్నడూ నిరుత్సాహానికి తావివ్వకూడదు. ఎందుకంటే మనిషికి మనిషే మిత్రుడూ, శత్రువు. నేను అనే ఉన్నత భావన మనః సంకల్పాన్ని దృఢపరచి అఖండ విజయాలకు ప్రతీకయై నిలుస్తుంది. నేనింతే అనే నిరాశ బలోపేతమై అడుగడుగునా నిరుత్సాహపరుస్తూ హీనదశకు చేరుకునేలా చేస్తుంది.
మనలోనే ఉన్న అనంత తత్తాన్నీ, అఖండ విశ్వాసాన్ని గ్రహించగలిగితే, అనంతమే మన నిజ తత్తమనీ, మన సంకల్పానికి ఆకాశమే హద్దనీ గుర్తించగలిగితే అద్భుతమైన శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. మానవ జీవిత లక్ష్యం మనస్సులో దృఢపడే విశ్వాసంతో సాధ్యపడుతుంది. అత్యున్నత ఆలోచనలతో సాకారం అవుతుంది. చరిత్రలో జరిగిన జరుగుతున్న జరగబోయే సాఫల్యాకూ, విజయాలకూ, అద్భుతాలకూ, ఆనందాలకూ మానవులే మూలకారణం.

Satsangatyam

సత్సాంగత్యం
Posted On:12/17/2014 1:22:18 AM
యద్భావం తద్భవతి అన్నట్లు మనం ఎటువంటివారితో కలిసివుంటే మనకు అటువంటి లక్షణాలు అబ్బుతాయని మన పెద్దల అనుభవం. ఆరునెలల సహవాసం చేస్తే వారు వీరౌతారని లోకప్రసిద్ధి.
సదాచారణ, సదాశయాలు కలిగిన సాధుసజ్జనులతో సాంగత్యాన్ని కలిగివుంటే ఐహికమైన సుఖసంతోషాలతో పాటు ఆముష్మికమైన శ్రేయస్సును కూడా పొందవచ్చు. సత్పురుషుల దర్శనం పుణ్యాన్ని కలిగిస్తుంది. సత్పురుషుల స్పర్శవల్ల సకల పాపాలు తొలగుతాయి. సత్పురుషులతో మాట్లాడటం వల్ల పవిత్రమైన అనేక నదుల్లో స్నానం చేసినట్టి ఫలితం కలుగును. సత్పురుషులకు చేసే నమస్కారం ముక్తిని ఇస్తుంది.

సాధూ నాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనమ్
సంభాషణం తీర్థకోటి వందనం మోక్షకారణమ్ ॥ అని ఆర్యోక్తి.

సత్యాంగత్యం వల్ల మందబుద్ధి తొలగుతుంది. సత్సాంగ త్యం సత్యమైన వాక్కులనే పలికిస్తుంది. పాపాన్ని దూరం చేస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచుతుంది. కీర్తిప్రతిష్ఠలను అంతటా వ్యాపింపచేస్తుంది. సత్సాంగత్యాన్ని కలిగియున్న భక్తులకు అందరి అభిమానం సులభంగా అందుతుంది.ఈ విధమైన బహుళ ప్రయోజనాలను అందించే సత్సాంగత్యం మనకు చేయలేని మేలు అంటూ ఏదీ ఉండదు
జాడ్యం ధియో హరతి వాచి సత్యం
మానోన్నతిం దిశతి పాపమపాకరోతి
చేత ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం

సత్సంగతిః కథయ కిం న కరోతి పుంసామ్ ॥ అని భర్తృహరి పేర్కొనెను.
చిత్రవిచిత్రమైన బంధుత్వాలతో, బాధ్యతలతో, బంధాలతో, వివిధ ఆకర్షణలతో, రకరకాల సమస్యలతో సతమతమవుతూ యంత్రాలతో పోటీపడుతూ యాంత్రికమైన జీవనాన్ని కొనసాగిస్తూ తమ జీవితానికి గమ్యమేదీ, లక్ష్యమేదీ అని పరితపించేవారికి చందనస్పర్శవలె చంద్రునివెన్నెలవలె హాయిని ఆనందాన్ని కలిగించేది సత్సాంగత్యమే. ఇట్టి సత్సాంగత్యాన్ని ఏర్పరచుకుందాం. జీవితాన్ని చరితార్థం చేసుకుందాం.

Bhaktuni Pratigna

భక్తుని ప్రతిజ్ఞ
Posted On:12/18/2014 1:50:21 AM
భక్తరక్షణకై దుష్టశిక్షణకై శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా, ఇంకా ఎన్నెన్నో రూపాలతో పరమాత్మ భూమిపైకి దిగివచ్చాడు. ఆయా అవతారాలను ఎత్తిన సమయంలో పరమాత్మ తాను చేసిన ప్రతిజ్ఞకు చెప్పిన మాటలకు కట్టుబడి భక్తజనులను ఎందరెందరినో ఉద్ధరించాడు.అయితే కొన్నిసార్లు తన భక్తుడి ప్రతిజ్ఞను నెరవేర్చే క్రమంలో తన ప్రతిజ్ఞను కూడా వదిలాడు. తాను తన మాటకు కట్టుబడి ఉండుటకన్నా, తన భక్తుని ప్రతిజ్ఞ నెరవేర్చుటయందే దృఢదీక్షను పూనియుంటానని తన ఆచరణ ద్వారా లోకానికి చాటిచెప్పాడు.
శ్రీకృష్ణావతార సందర్భంలో భగవానుడు ఆయుధం పట్టనని తాను చేసిన ప్రతిజ్ఞకన్నా తన భక్తుడైన భీష్మాచార్యుడు పరమాత్మచేత ఆయుధం పట్టిస్తాను అని చేసిన ప్రతిజ్ఞను నెరవేరుస్తూ యుద్ధభూమిలో రథచక్రాన్ని చేపట్టాడు.
అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేరుటకు తన చక్రంతో సూర్యకిరణాలను అడ్డుకొని సూర్యాస్తమయం అయినట్లు భావించేరీతిలో ఒక సందర్భాన్ని కల్పించాడు.

హిరణ్యకశుపుని, రావణాసురుని తపస్సులను మెచ్చి బ్రహ్మరుద్రులు ఇచ్చిన వరాలకు ఆటంకం లేకుండా శ్రీహరి నృసింహ, శ్రీరామాది అవతారాలనెత్తాడు. పరమాత్మ అంతటా వ్యాపించియున్నాడు అని భక్తప్రహ్లాదుడు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చుటకు చైతన్యం లేని స్తంభంలోనుండి నృసింహరూపంలో ఆవిర్భవించాడు.
భగవంతుని స్థిరంగా నమ్మినవారికి ఎట్టి ఆపదలు సంభవించవు - న వాసుదేవ భక్తానాం అశుభం విద్యతే క్వచిత్ అని చెప్పబడిన విషయాన్ని ధ్రువపరుస్తూ ఆర్తికలిగిన గజేంద్ర - ధ్రువ - విభీషణ - అంబరీష - ద్రౌపది మొదలైన వారెందరినో శ్రీహరి రక్షించాడు.

తను అనన్యభావనతో ఆరాధించే భక్తులకు ఎటువంటి ఆపదలు సంభవించకుండా వారిని తప్పక రక్షిస్తానని లోకులందరు గుర్తుంచునట్లుగా తన భక్తుడైన అర్జునితో శ్రీకృష్ణ పరమాత్మ ప్రతిజ్ఞ చేయించాడు - కౌంతేయ! ప్రతిజానీహిన మే భక్తః ప్రణశ్యతి నా భక్తుడు ఎన్నటికీ వినాశమును పొందడని ఓ కుంతీ పుత్రుడా ప్రతిజ్ఞ చేయుము. నీ ప్రతిజ్ఞను నేను నెరవేరుస్తూ భక్తకోటిని రక్షిస్తాను అని తెలిపాడు. తన దగ్గర విద్యలనభ్యసించిన శిష్యునిచేతిలో తానోడిపోవాలని గురువు భావించునట్లు తన అభివృద్ధిని మించినరీతిలో కుమారుని ప్రగతిని కోరే తండ్రివలె భక్తసులభుడైన శ్రీహరి ప్రతిజ్ఞ నెరవేర్చుటకే సంసిద్ధుడై ఉంటాడనే సత్యాన్ని గుర్తిద్దాం. భగవంతుని విషయంలో భక్తిని కలిగియుందాం. 

చాగంటి గారి ప్రవచనములు

Courtesy: http://chagantipravachanamulu.blogspot.in/search?updated-min=2014-01-01T00:00:00-08:00&updated-max=2015-01-01T00:00:00-08:00&max-results=13

చాగంటి గారి ప్రవచనములు 


Chaganti gari Speech at HMA

Part 1

Part 2

Part 3

Part 4

Chaganti gari Speech at HMA

About Chaganti Koteswara Rao garu

Brahmasri Chaganti Koteswara Rao (చాగంటి కోటేశ్వరరావు) is an eminent speaker on matters related to Sanathana Darma. He was born to Sri Chaganti Sundara Siva Rao garu and Smt Suseelamma. He married Smt.Subramanyeswary and has two children. As of 2014 he is working in Food Corporation of India, Kakinada.
Spiritual Discourses:
Sri Chaganti Koteswara Rao is a silent reader of puranas and blessed with wonderful oratory skills. He started giving pravachan on puranas extempore and proven his spectacular command on Spiritual Discourses on various Puranas, Ithihasams like Srimad Ramayanam, Srimad Bhagavatham and devotional hymns like Soundarya Lahari and Lalitha Sahasranama strotram. He has delivered discourses for 42 days continuously at Guntur on Sampoorna Ramayanam during 2005, Srimad Bhagavatham for 42 days during 2006, Shiva Maha Puranam for 30 days during 2007 and Sree Lalitha Sahasranama Stothram for about 45 days during 2008 . In addition he gave numerous pravachanams on various topics throughout the country.

He gives his discourses in Telugu language. He mesmerizes the audience with well refined reciting and thought provoking citations from various puranas extempore.

He has achieved what perhaps no other Telugu scholar managed to do. He has, by the quality of his pravachanams, command over Telugu language and all the classic texts, single handedly revived interest in Telugu classics and literature among the current generation. It is no exaggeration to say that in this age of English language assault on the world, BrahmaSri Chaganti Koteswara Rao stands tall holding out the greatness of Hindu culture, Hindu mythology to the present generation in Telugu language. The beauty of his pravachanas is visualization which is very much needed for today's world.

Listening to any of his complete pravachanams (Ramayana|Sampoorna Ramayanam), there are two classic advantage Sravana is hearing of Lord's Lilas. Sravana includes hearing of God's virtues, glories, sports and stories connected with His divine Name and Form. The devotee gets absorbed in the hearing of Divine stories and his mind merges in the thought of divinity; it cannot think of undivine things. The mind loses, as it were, its charm for the world. The devotee remembers God only even in dream.

The devotee should sit before a learned teacher who is a great saint and hear Divine stories. He should hear them with a sincere heart devoid of the sense of criticism or fault-finding. The devotee should try his best to live in the ideals preached in the scriptures.

One cannot attain Sravana-Bhakti without the company of saints or wise men. Mere reading for oneself is not of much use. Doubts will crop up. They cannot be solved by oneself easily. An experienced Guru is necessary to instruct the devotee in the right path.

King Parikshit attained Liberation through Sravana. He heard the glories of God from Suka Maharishi. His heart was purified. He attained the Abode of Lord Vishnu in Vaikuntha. He became liberated and enjoyed.




Gantasala Bhagavad Gita



The Bhagavad Gita is one of the world-scriptures today. It guides the lives of people all over the world. Sri Swami Sivananda wants us to study daily at least one discourse of the scripture, so that its great lessons are ever fresh in our memory.
The Gita consists of eighteen chapters in total,
Chapters 1--6 are Karma yoga,
Chapters 7--12 are Bhakti yoga and
Chapters 13--18 Jnana yoga or knowledge.

Gantasala Bhagavad Gita



Friday, December 26, 2014

Mahaneeyudu Manishi

మహనీయుడు మనిషి
Posted On:12/13/2014 1:35:48 AM
షడ్ దోషాః పురుషేణేహ హాతవ్యా భూతిమిచ్ఛతా!
నిద్రా తంద్రా భయం క్రోధ ఆలస్యం దీర్ఘసూత్రతా॥

మనుషులంతా ఉన్నతంగా బతకాలనీ కోరుకుంటారు. అయితే అభ్యున్నతిని కోరేవారు ముఖ్యంగా ఆరు దోషాలను విడిచిపెట్టాలని శాస్త్రం చెబుతుంది. నిద్ర, బద్ధకం, భయం, కోపం, అలసత్వం దీర్ఘసూత్రత (ఎటు తెగని ఆలోచన) ఈ ఆరు దోషాలను మనుషులు తమ తమ ఆధీనంలో ఉంచుకోవాలి. ప్రణాళికాబద్ధంగా వీటిని జయించి కలలను సాకారం చేసుకునే దిశగా జీవితాన్ని సఫలం చేసుకోవాలి.
జీవన పయనంలో ఎత్తుపల్లాలూ, ఆటుపోట్లూ తప్పవు. పరిస్థితులు అందించే అనుకోని అనుభవాలు ఎదురుదెబ్బలు తగిలినప్పుడు, ఎంతటివారైనా కుంగిపోతారు. నిరాశా నిస్పృహలు అలుముకొని ముభావంగా మా జీవితమే ఇంతని గడుపుతుంటారు. తనకు మించి తాను ఉన్నతంగా లేని మానవుడు హీనస్థితికి చేరుకుంటాడన్న మహానుభావుల అనుభవసారం గుర్తుచేసుకుంటూ ఆశాపూరిత భావాలతో కృషి చేయాలి.
ఉద్ధరేదాత్మ నాత్మానం నాత్మాన మీవ సాదయేత్‌
ఆత్తైవహి ఆత్మనోబంధుః ఆత్తెవరిపురాత్మనః॥

మానవుడు తనను తానే ప్రోత్సహించుకోవాలి. ఉద్ధరించుకోవాలి. ఎన్నడూ నిరుత్సాహానికి తావివ్వకూడదు. ఎందుకంటే మనిషికి మనిషే మిత్రుడూ, శత్రువు. నేను అనే ఉన్నత భావన మనః సంకల్పాన్ని దృఢపరచి అఖండ విజయాలకు ప్రతీకయై నిలుస్తుంది. నేనింతే అనే నిరాశ బలోపేతమై అడుగడుగునా నిరుత్సాహపరుస్తూ హీనదశకు చేరుకునేలా చేస్తుంది.
మనలోనే ఉన్న అనంత తత్తాన్నీ, అఖండ విశ్వాసాన్ని గ్రహించగలిగితే, అనంతమే మన నిజ తత్తమనీ, మన సంకల్పానికి ఆకాశమే హద్దనీ గుర్తించగలిగితే అద్భుతమైన శాశ్వతమైన ఆనందం కలుగుతుంది. మానవ జీవిత లక్ష్యం మనస్సులో దృఢపడే విశ్వాసంతో సాధ్యపడుతుంది. అత్యున్నత ఆలోచనలతో సాకారం అవుతుంది. చరిత్రలో జరిగిన జరుగుతున్న జరగబోయే సాఫల్యాకూ, విజయాలకూ, అద్భుతాలకూ, ఆనందాలకూ మానవులే మూలకారణం.

Manava Sambandhalu

మానవ సంబంధాలు
Posted On:12/19/2014 12:48:09 AM
దేశమంటే మట్టి మాత్రమే కాదు, దేశమంటే మనుషులు అన్నట్లు వ్యక్తి ఎన్నడూ ఒంటరి కాదు. వ్యక్తి అంటే వ్యవస్థ. కుటుంబం అనే పునాది వేసుకొని, బంధాలు, అనురాగాలు స్నేహాలు, మరువలేని పరిచయాలు, నైతిక విలువలు... ఇటుకలుగా చేసుకొని ప్రపంచమనే మహాసౌధాన్ని నిర్మించుకున్న మహా మనిషి మనిషి.
వ్యతిషజతి పదార్థానంతరః కోపి హేతుః
నఖలు బహిరుపాధీన్ ప్రీతయః సంశ్రయంతే!
వికసతి హి పతంగ స్యోదయే పుండరీకం
ద్రవతి చ హిమరశ్మావుద్గతే చంద్రకాంతః॥

మానవ విలువలను ప్రపంచానికి పరిచయం చేసిన శ్రీరాముని మానసిక దృక్పథానికి అద్దంపట్టే సందర్భాన్ని నిశితంగా పరిశీలిస్తే - సూర్యోదయం కాగానే కమలం వికసిస్తుంది. చంద్రుని వెన్నెల రాగానే చంద్రకాంతశిల ద్రవిస్తుంది. అనంత వినీలాకాశంలో ఉండే సూర్యచంద్రులకూ, అల్లంతదూరంలో భువిపై, నీటిలో ఉండే వాటికి గల ఆకర్షణశక్తి ఎంతబలీయమైనది, దృఢమైనది. అలాగే లవుడు, శ్రీరామునికి ఎదురుపడినపుడు నిమిత్తమెరుగని స్నేహం, ప్రేమ, వాత్సల్యం హృదయసీమను అలంకరించాయట. బాంధవ్యంలోని గొప్పతనమేమిటంటే అంతః కరణాదులను వ్యక్తీకరించలేని కారణం దగ్గరకు లేస్తుంది. బుద్ధికతీతమై కారణం ఆకర్షణకు గురిచేస్తుంది. కట్టుదిట్టాలను ఎరుగని బంధం ఎంతటి అగాధాన్నైనా మరిపిస్తుంది.
లోకంలో వెలకట్టలేనివి అనుబంధాలు. జీవితం వాటిని బలోపేతం చేసేందుకే పరిస్థితులను కల్పిస్తుందేమో! ఒక్క మానసికంగా జరిగే సంఘర్షణ తాలూకు సూచనను ఆలకిస్తే దూరమైపోయే అనుబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవచ్చు. జన్మజన్మల సారూప్యతను ప్రతీకలైన బంధాలను సుహృదయంతో ఈ జన్మకైనా దృఢతరం చేసుకునే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి.
సహృదయులైన మనుషులు ఎలాంటివారో వారు నిలబెట్టుకున్న కుటుంబాన్నీ, సత్సంబంధాలనూ, నైతిక విలువలను బట్టి నిర్ధారించవచ్చు. ఒంటిరిగా పుట్టి ఒంటరిగానే వెళ్లిపోయే జీవన చక్రంలో మనకంటూ నలుగురు తోడున్నారనే భావన బంధాల మాధుర్యాలను అనుభవించాననే సంతృప్తి వ్యక్తిని చిరస్థాయిగా మానవ హృదయాలలో ఉండేలా చేస్తుంది. ఆ వ్యక్తి ఆదర్శాన్ని చరిత్ర గౌరవిస్తుంది. 

Bheeshmuni Jananam

భీష్ముని జననము
Posted On:12/20/2014 2:02:09 AM
ఒకనాడు వేట నిమిత్తము బయలుదేరిన శంతనుడు గంగానదీ తీరమున మహాద్భుతమైన అందమైన స్త్రీని చూసెను. ఆమె అపర లక్ష్మీదేవీ వలె రూప సౌందర్యమును కలిగి ఉండటం చూసి శంతనుడు చకితుడయ్యెను. ఆ దివ్యమైన స్త్రీ యెడల తన ప్రేమ ఇనుమడించి శంతనుడు తన మిక్కుటమైన కోరికను తెలిపెను. ఆ గంగాదేవి ఇట్లనెను- ఓ రాజా ! నేను మీకు రాణిగా ఉండటం నాకిష్టమే కానీ మీరు నా మాట ఎప్పుడూ కాదనకూడదు. ఒకవేళ మీరు నన్ను విమర్శిస్తే నేను వెళ్లిపోగలను.
అష్ట వసువులు వసిష్ఠుని శాపము వలన శంతనుని ద్వారా గంగకు జన్మించిరి. వెనువెంటనే గంగలో, గంగచేతనే విసిరివేయబడి శాప విమోచన పొందిరి. అష్టమ వసువైన భీష్మున్ని కూడా గంగ తీసికెళ్లు సమయములో శంతనుడు వారించినందువలన భీష్మున్ని శంతనునికి వప్పగించి తాను వెళ్లుటకు సిద్ధపడెను.
శంతనుడు గంగను ఉద్దేశించి ఇట్లడిగెను- ఈ వసువులకు వసిష్ఠుడు శాపమెందుకిచ్చెను మరియు అష్టమ వసువైన భీష్ముడు భూలోకమున ఎందుకుండ వలెను?
గంగాదేవి ఇట్లు చెప్పెను- విశ్వ విఖ్యాతమైన వసిష్ఠుడు వరుణుని పుత్రుడు. అతడు మేరు పర్వతము దగ్గర ఉన్న ఆశ్రమములో ఉండేవాడు. కామధేనువు యొక్క పుత్రికయైన నందిని వసిష్ఠుని దగ్గర ఉండేది. ఒకనాడు వసువులెల్లరు తమ తమ భార్యల యుక్తముగా ఆ తావుకు విహారమునకు వచ్చిరి. అచ్చట ఉన్న నందినిని చూసి ద్యౌ అను వసువు భార్యయొక్క ప్రేరేపణ చేత ఇతర వసువులతో కలిసి ఆ గోవును తరలించుకు పోయెను. అందుకని వసిష్ఠుడు వారిని శపించెను. ప్రధాన కారకుడైన ద్యౌ అను వసువు భూలోకమున ఉండునట్లు చేసెను. ఆ రకముగా ఆ వసువే భీష్ముడు అని గ్రహించవలెను.

ఒకనాడు శంతనుడు గంగానది తీరమున విహరిస్తూ నదివైపు చూసి చిత్రపడెను, ఆ జీవనదిలో నీరు అంతంత మాత్రమే ఉండెను. విషయము కనుక్కున్న శంతనుడు మరీ విస్మయమొందెను. ఒక బాలుడు తన అస్త్ర విద్య చేత నీటి ప్రవాహమును ఆపివేసెను. శంతనుడు అయోమయమునకు గురికాగా బాలుడు అంతర్థానయ్యెను.
రాజర్షి శంతనుడు బాలుడుని చూపుమని గంగాదేవిని అడుగగా గంగ బాలుని కుడిచేతిని పట్టుకొని వచ్చెను. మహారాజా ! ఈ బాలుడు మన ఎనిమిదవ సంతానం. వసిష్ఠుని దగ్గర వేద వేదాంగాలు అభ్యసించి అ శ విద్యలన్నియు నేర్చుకొని, యుద్ధములో ఇంద్రునితో సమానుడు, బృహస్పతి మరియు శుక్రాచార్యునంతటి మేధస్సు గలవాడు మరియు పరశురామునంతటి తేజస్సు గలవాడు, దేవవ్రత నామధేయుడు ఇతనిని రాజధానికి తీసికెళ్లండి అని చెప్పెను. రాజర్షి శంతనుడు కుమారున్ని రాజధానికి తీసుకు వచ్చి యువరాజ పట్టాభిషేకము చేసెను.

Parusha Vakku

పరుషవాక్కు
Posted On:12/24/2014 1:51:55 AM
విస్పష్టమైన భావవ్యక్తీకరణకు భగవంతుడు మానవులకు ప్రసాదించిన అమోఘమైన వరమే వాక్కు. ఈ వాగ్భూషణం మానవులను మహనీయులుగా తీర్చిదిద్దగలుగుతుంది. పశుపక్ష్యాదులకు లేని సౌకర్యం మానవులకు లభించినందుకు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొనవలసినదే. అంతే తప్ప ఏ దశలోనూ వాక్కును దుర్వినియోగం చేయరాదు.
ప్రియమైన వాక్కుతో సాధ్యమైనంతగా అందరినీ సంతోషింపచేయాలి. అంతే కాని ఎదుటివారిని నొప్పించే పద్ధతిలో పరుషమైన వాక్కులను పలుకవద్దు అని ఆర్యాశతకకర్తయైన సుందరపాండ్యుడు లోకానికి హితప్రబోధం చేశాడు.
యుద్ధాలలో మనుషలను ఆయుధాలు గాయపరుస్తూ ఉంటాయి. విషం మానవుల ప్రాణాల ను హరిస్తుంది. నిప్పు నిలువునా మనిషిని కాల్చివేస్తుంది. పాపకర్మలు మనిషిని అప్పుడప్పు డూ ఆయా సందర్భాలనుబట్టి పీడిస్తూ ఉంటాయి. కాని ఇవేవీ బాధించని రీతిలో హృదయానికి కుచ్చుకున్న ముల్లులా మనుషలను ప్రతి క్షణం పట్టి పీడించేవి పరుషంగా పలికే పలుకులే .

న తథా రిపుః న శస్త్రం నాగ్నిః న విషం న దారుణో వ్యాధిః
పరితాపయతి చ పురుషం యథా కటుకభాషిణీ వాణీ ॥
అని సుందరపాండ్యుని ఆర్యోక్తి. (ఆర్యావృత్తంలో పలికిన సూక్తి).

కఠినంగా, పరుషంగా మాట్లాడేవారికి ఆప్తులు, ఆత్మీయులు దూరమౌతారు. సన్మార్గంలో పయనించేవారు అట్లే అన్యమార్గంలో పయనించేవారు అనే భేదం లేకుండా స్త్రీలు-పురుషులు చిన్నలు-పెద్దలు అనే తేడా లేకుండా అన్ని కాలాలకు అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తులందరికీ మనోవేదనను కలిగించేవి పరుషవాక్కులే అనే సత్యాన్ని గుర్తిద్దాం. పుల్లవిరుపు మాటలతో, వ్యంగ్యోక్తులతో, అధిక్షేపాలతో, నిష్ఠరమైన వాక్కులతో హృదయానికి గాయాన్ని కలిగించే విధానానికి స్వ్తిచెప్పే ప్రయత్నాన్ని చేద్దాం.
పాముకాటుతో, విషప్రయోగంతో, అగ్నిప్రమాదంతో ఒకేసారి ప్రాణాలు పోతాయి. ఈ విషాదాన్ని మించినరీతిలో పరుషవాక్కులచేత గాయపడినవారు అటు ప్రాణాలు పోక, ఇటు ప్రశాంతంగా ఉండలేక ప్రతిక్షణం సతమతమవుతూ విలవిలలాడుతూ ఉంటారు. ఇటువంటి బాధ మనవల్ల మరొకరికి కలగడం సరికాదనే సత్యాన్ని గుర్తిద్దాం. ఆచరించే ప్రయత్నం కూడా చేద్దాం.

Vijaya Patham

విజయపథం
Posted On:12/26/2014 2:27:08 AM
లోకంలో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు అందరూ తమ తమ రంగాల్లో తప్పక విజయా న్ని సాధించాలని కోరుకుంటూనే ఉంటారు. ఆటల్లో, పాటల్లో, మాటల్లో, వివిధ వ్యవహారాలలో, విద్యా ఉద్యోగ వ్యాపార పరిపాలనాది రంగాలలో విజయాన్ని స్వంతం చేసుకోవాలనుకునేవారి కి జిహ్వా యేన జితా త్రైలోక్యమపి తేన జితం అనే సూక్తి ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తున్నది.
ఎవరైతే నాలుకను గెలుస్తారో, వారు ముల్లోకాలను గెలిచినట్లేనట. నాలుకను గెలవడం అంటే .... నాలుకతో చేసే రెండు పనులలో జాగ్రత్త వహించటమే. 1)నాలుకతో మాట్లాడే మాటలపై నియంత్రణ కలిగియుండటం. అవసరమైన మాటలనే మాట్లాడ టం. మితిమీరి మాట్లాడకపోవటం. 2)నోటితో తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించటం. కొందరు రుచికరమైన పదార్థాలపై వ్యామోహంతో ఎంతపడితే అంత, ఎక్కడపడితే అక్కడ, ఏదిపడితే అది, ఎప్పుడు పడితే అప్పుడు తింటూ రకరకాల అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటూ ఉంటారు. జిహ్వాచాపల్యంతో తినడానికే బ్రతుకుతున్నట్లుగా భావిస్తారు. ఇది సరికాదు. నాలుకను తమ నియంత్రణలో పెట్టుకున్న మహనీయులు మాత్రం మితమైన, హితమైన ఆహారాన్ని తీసుకుంటూ బతకడానికే తిండి అనే యథార్థ బుద్ధితో జీవిస్తారు. ఈ విధంగా మాట్లాడే మాట విషయంలో, తినే తిండి విషయంలో ఒక క్రమపద్ధతిని ఏర్పరచుకున్నవారికి ముల్లోకాల్లో విజయమే తప్ప పరాజయం ఉండదు.
అన్ని అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తే సకల కార్యాలను అవలీలగా చేస్తూ విజయపరంపరను స్వంతం చేసుకోవచ్చని అందరం భావిస్తూ ఉంటాం. అయితే మూగతనం, చెవిటిత నం, గుడ్డితనం అనేవి ఎవరిలో ఉంటే వారే ముల్లోకాలను అవలీలగా గెలవగలుగుతారని ఒక కవి చమత్కారంగా పేర్కొన్నాడు.
మూగతనాన్ని, చెవిటితనాన్ని, గుడ్డితనాన్ని కలిగియుంటే విజయాలు ఎట్లా స్వంతం అవుతాయి? అనే ప్రశ్నకు సమాధానంగా కవి-ఇతరులను అవమానించ టంలో మూగవారిలాగా, ఇతరులు తమను అకారణంగా నిందించే సమయంలో చెవిటివారిలాగా, ఇతరుల దోషాలను చూసే విషయంలో గుడ్డివారిలాగా ఎవరు వ్యవహరిస్తారో వారికి ముల్లోకాల్లో ఎదురు ఉండదు, సమస్త వ్యవహారాల్లో విజయాలు వరిస్తాయి -
పరివాదేషు యే మూకా - బధిరాశ్చ పరోక్తిష
పరరంధ్రేషు జాత్యన్ధాః - తైర్జితం భువనత్రయమ్ ॥
అని సకలజన రంజకంగా కర్తవ్యోపదేశపరంగా కవి పలికిన పసిడిపలుకులలోని ఆంతర్యాన్ని గ్రహిద్దాం. ఆచరించే ప్రయత్నం చేస్తూ విజయపథంలో పయనిద్దాం.

Yeka lavya Katha

ఏకలవ్య కథ
Posted On:12/27/2014 1:46:17 AM
ఒకరోజు ఆచార్యుల వారి అనుమతి తీసుకొని రాజకుమారు లెల్లరు అడవికి వెళ్లిరి. వారి సరుకులు మోస్తూ ఒక అనుచరుడు, ఒక కుక్క కూడా వస్తూ ఉండెను. ఆ కుక్క అటూ ఇటూ తిరుగుతూ ఏకలవ్యుడు సాధన చేస్తున్న తావుకు వెళ్లెను. ఏకలవ్యుడు మొదట ద్రోణాచార్యుని వద్ద శిష్యరికము చేయతలంచెను. కానీ అది కుదరక ఆచార్యుల బొమ్మ పెట్టుకొని అందులో నిపుణుడాయెను. ఆ కుక్క మొరుగుచూ ఆటంక పరచగా ఏకలవ్యుడు ఏడు బాణములు సుతి మెత్తగా దాని నోటిలో నాటెను. ఆ సునిశితమైన బాణవిద్యను గమనించిన అర్జునుడాదిగా గల రాకుమారులు పలుకరించగా నేను ఏకలవ్యుడను, ద్రోణాచార్యుని శిష్యుడననెను.
ఆశ్రమమును చేరుకున్న అర్జునుడు ద్రోణాచార్యునితో ఇట్లనెను. గురువర్యా ! ఏకలవ్య నామధేయుడైన మీ శిష్యుడు నా కన్నా మేటి ధనుర్ధరుడు అని విషయమంతా పూసగ్రుచ్చినట్లు వివరించెను. కొద్దిసేపు మౌనంగా ఉన్న ద్రోణాచార్యుడు ఆ పిదప అర్జునున్ని తీసుకొని ఏకలవ్యుని దగ్గరకు చేరుకొనెను.
ఆ సమయములో ఏకలవ్యుడు ఎడతెరపి లేకుండా బాణములు సంధిస్తూ అభ్యాసము చేయుచుండెను. ఆచార్యున్ని చూడగానే ఏకలవ్యుడు దగ్గరగా వచ్చి సాష్టాంగ దండ ప్రణామమాచరించి, విధి పూర్వకముగా పూజచేసి, రెండు చేతులు జోడించి ఎదురుగా నిల్చుండెను. వాస్తవముగా నా శిష్యడవైనచో నాకు గురుదక్షిణ ఇమ్మని ద్రోణాచార్యుడు కోరెను. ఏది కోరినా ఇస్తానని ఏకలవ్యుడు అనెను. నీ కుడిచేతి బొటనవ్రేలునిమ్మని కోరినదే తడవుగా దానిని తెగనరికి ఆచార్యునికిచ్చెను. అప్పటి నుండి ఏకలవ్యుని బాణవిద్య అంతరించెను.

Gruhastha Jeevanamu

గృహస్థజీవనము
Posted On:12/25/2014 1:55:22 AM
సృష్టిలోని ప్రాణులలో మానవజన్మ ఎంతో విశిష్టమైనది అనే విషయాన్ని నరత్వం దుర్లభం లోకే, ప్రాణినాం నరజన్మ దుర్లభం, దుర్లభో మానుషో దేహః వంటి శావాక్యాలు ధ్రువపరు స్తున్నాయి. ఈ మానవజన్మ పూర్వజన్మలలోని పుణ్యఫలంగా లభిస్తుంది మానుష్యం పుణ్య సంచయాత్ అని చెప్పబడింది.
మనుష్య జీవనము బ్రహ్మచర్య-గృహస్థ-వానప్రస్థ-సన్యా సము అనే నాలుగు విభాగములతో కూడినది. వేదవేదాంగాది విద్యా సముపార్జనకై ఉద్దేశింపబడినది బ్రహ్మచర్యము. బ్రహ్మచారి విద్యాభ్యాసం తరువాత ప్రజాతంతుం మా వ్యవచ్ఛేత్సీః అనే శ్రుతివాక్యరూపమైన గురూపదేశాన్ని పురస్కరించుకొని యథా యోగ్యమైన కన్యను అన్వేషించి ఆమెను వివాహం చేసుకొని గృహ స్థ జీవనాన్ని కొనసాగించవలెను.బ్రహ్మచర్య-గృహస్థ-వానప్రస్థ-సన్యా సాశ్రమములలో ఏది ముఖ్యమైనది అనే చర్చ ఉదయించి నప్పుడు, ఏది గొప్పదని తూకం వేసి చూసినట్లయితే బ్రహ్మచర్య- వానప్రస్థ-సన్యాసములు అనే మూడు ఒక ఎత్తు కాగా, గృహస్థజీవనము ఒక్కటియే మరొక ఎత్తు అని పండితులు నిర్ణయించి చెప్పుదురు -
ఆశ్రమాం స్తులయా సర్వాన్ ధృతానాహుర్మనీషిణః
ఏకతశ్చ త్రయో రాజన్ గృహస్థాశ్రమ ఏకతః ॥
అనే మహాభారతసూక్తి తెలియజేయుచున్నది.
గృహస్థుడే పశుపక్ష్యాదులను, సర్వప్రాణులను పోషించునట్టివాడు. అందుకే గృహస్థుడే శ్రేష్ఠడు - వయాంసి పశవశ్చైవ భూతాని చ జనాధిప గృహైస్థెరేవ ధార్యంతే తస్మాచ్ఛ్రేష్ఠో గృహాశ్రమీ ॥ అని వ్యాసమహర్షి ధర్మరాజునకు బోధించెను.

మండువేసవిలో పక్షులు, జంతువులు, బాటసారులు వీరు, వారు అనే భేదం లేకుండా ప్రాణుల న్నీ ఒక మహావృక్షాన్ని ఆశ్రయించి తమ తాపాన్ని పోగొట్టుకున్నట్లే బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులు అందరూ సంస్కారవంతుడైన గృహస్థుని ఆశ్రయించి ఉంటారని శాస్త్రోక్తి.
ఈ గృహస్థుడు యజ్ఞయాగాది వైదిక క్రియాకలాపముల ద్వారా దేవతలను సంతృప్తిపరచును, శ్రాద్ధకర్మలతో పితృదేవతలను, సద్గ్రన్థపఠనముతో మహర్షులను, ఆదరాభిమానములతో అతిథు లను గౌరవించును. గృహస్థుడు జ్ఞాన-వయో-శీల వృద్ధులైన తల్లిదండ్రులను, గురువులను గౌర విస్తూ, గోదాదేవి తిరుప్పావై ప్రబంధంలో ఐయముం పిచ్చైయుం అని పేర్కొన్న రీతిలో యోగ్యు లను దానమును సెలుపుతూ, యాచకులను సంతృప్తిపరచే విధంగా ధర్మమును ఆచరిస్తూ, ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించగలిగిన యోగ్యత, శక్తి కలవాడు.
అందుకే ఒక కవి ధన్యో గృహస్థాశ్రమః అని పేర్కొన్నాడు. సమాజానికి శ్రేయస్సును కలిగిం చే రీతిలో గృహస్థజీవనాన్ని కొనసాగించే దిశగా ప్రయత్నిద్దాం.

HYDERABAD BOOK FAIR 2014

HYDERABAD BOOK FAIR 2014

Tuesday, December 23, 2014

తప్పక చదవండి.. తెలుగు టైపింగ్ లో ఇక మీ సందేహాలకు వీడ్కోలు పల్కండి

  http://telugukala.blogspot.in/2009/12/blog-post_08.html

తప్పక చదవండి.. తెలుగు టైపింగ్ లో ఇక మీ సందేహాలకు వీడ్కోలు పల్కండి

కంప్యూటర్లో తెలుగు రాయడం

తెలుగులో టైపింగు
2007 లో నా ప్రశ్నలు…

1.తెలుగు వికీపీడియాలో టైపు చెయ్యడం సులభంగా వుంది.కాని నెట్లోకి వెళ్ళకుండానే ఎమ్.ఎస్.వర్డ్ లో ఇలా టైపు చెయ్యడం కుదురుతుందా?
2.పి.డి.యఫ్.ఫైళ్ళలోని తెలుగు టెక్స్ట్ ను ఎమ్.ఎస్.వర్డ్ ఫైలులోకి పేస్టు చేసుకో గలమా? __
3.అనూ ఫాంట్లలో ఉన్న పాఠ్యాన్ని (text) యూనికోడ్లోకి మార్చడం ఎలా?

ఆపరేటింగ్ సిస్టమ్ లలో తెలుగును స్ధాపించడం:
1. స్టార్ట్ మెనూ లో Settings > Control Panel కి వెళ్ళండి
2. Control Panel లో Regional and Language Options ని ఎంచుకోండి
3. Languages టాబ్ కి వెళ్ళి అక్కడ Install files for complex script and right-to-left languages (including Thai) అనే చెక్ బాక్సుని ఎంచుకోండి.
4. Apply అనే మీట ని నొక్కండి.
5. Do you want to restart your computer now? అన్నప్పుడు Yes అనే మీటని నొక్కండి.మీ కంప్యూటర్ రీబూట్ అయ్యిన తరవాత తెలుగు చక్కగా కనిపిస్తుంది.

http://omicronlab.com/download/tools/iComplex_2.0.0.exe  .. ఇక్కడినుండి  ''iComplex_2.0.0.exe'''  ఫైల్స్ డౌన్ లోడ్ చేసుకుని మీ సిస్టమ్ లో ఇన్ స్టాల్ చేసుకోండి. అంతే. మన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ XP లో డీఫాల్ట్ గా గౌతమి ఫాంటు ఉంటుంది. కాని Windows 2000 , 98 వాడుతున్నప్పుడు ఇది పని చేయదు. వివిధ ఆపరేటింగ్ సిస్టమ్ లలో తెలుగును స్ధాపించడం, రాయడం. చదవడం కొరకు క్రింది వివరాలు పరిశీలించండి.

Win98 --http://etelugu.org/node/207
Win2000
--http://etelugu.org/node/208
Linux --http://etelugu.org/node/210


కంప్యూటర్లో తెలుగు రాయడం
లేఖిని  --http://lekhini.org/
గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ --http://google.com/transliterate/indic/telugu
క్విల్ పాడ్ --http://quillpad.com/telugu/#
స్వేచ్ఛ – http://swecha.org/input/index.html, http://atcweb.atc.tcs.co.in/opensource-downloads
యంత్రం --http://www.yanthram.com/te/
లిపిక్.ఇన్ -- http://lipik.in/telugu.html
ఇన్ స్కిప్ట్  -- http://telugublog.blogspot.com/2006/03/xp.html
బరహా  -- http://www.baraha.com/download.htm
అను మాడ్యూలర్ -- http://crossroads.koodali.org/2007/11/18/typing-unicode-telugu-using-other-keyboard-layouts/
అను ఆపిల్  -- http://crossroads.koodali.org/2007/12/25/apple-keyboard-layout/
అక్షరమాల  -- http://groups.google.com/group/aksharamala
జనగణమన --- http://www.janaganamana.net/TeluguJgm.aspx
లినక్స్ లో -- http://www.swecha.org/wiki/index.php?title=Input
అక్షర్  ---http://www.kamban.com.au/
TDIL --http://www.ildc.in/Telugu/TLindex.aspx

Microsoft -Indian language input tool--ఇటీవలే విడుదల అయ్యింది.నేరుగా తెలుగులోనే MS word,Excel లలో టైపు చేసుకోవచ్చు.


ఫైర్‌ఫాక్స్ విహారిణిలో
•    ఇండిక్ ఇన్‌పుట్ పొడగింత  -- https://addons.mozilla.org/en-US/firefox/addon/3972
•    పద్మ పొడగింత  -- https://addons.mozilla.org/en-US/firefox/addon/873
•    తెలుగు టూల్‌బార్ -- http://telugutoolbar.mozdev.org/
•    ప్రముఖ్ టైప్ --http://www.vishalon.net/Download/tabid/246/Default.aspx

సిస్టంలో తెలుగు ఎనేబుల్ చేసినా కూడా వార్తాపత్రికలు చదవాలంటే కష్టమే. దీనికి కారణం యూనికోడ్ లో మనమందరం వాడేది గౌతమి ఫాంట్. పేపర్ల ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ని కాపీ చేసుకుని My computer> C > Windows > Fonts లో పేస్ట్ చేయండి. భారతీయ భాషలలోని వార్తా పత్రికలను చదవడానికి :http://uni.medhas.org/

ట్రాన్స్లిటరేషన్ ఉపకరణాలు:
ఇవి మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తూ పోతూ ఉంటే, తెలుగు లోకి మారుస్తాయి. అంటే, "telugu" అని టైపు చేసి స్పేస్ కొట్టగానే "తెలుగు" గా మారుస్తాయి.

1. గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్: http://www.google.com/transliterate/indic/telugu
2. క్విల్‌ప్యాడ్: http://www.quillpad.com/telugu/editor.html
3. లేఖిని http://lekhini.org
లేఖిని ఉపకరణాన్ని offline కూడా వాడుకోవచ్చు. లేఖిని ని తిరగేస్తే నిఖిలే . తెలుగు చదవడం రానివారికి తెలుగు సందేశాన్ని నిఖిలే ఇంగ్లీష్ ఉఛ్ఛారణలోకి మార్చి పెడుతుంది.
http://lekhini.org/nikhile.html
4. itrans --http://www.aczoom.com/itrans/html/tlgutx/tlgutx.html
ఇప్పుడు ఇంటర్నెట్ లో అన్ని బ్రౌజరు లు యూనికోడ్ ను అర్ధం చేసుకుంటున్నాయి.కాపీ పేస్టు బాధ లేకుండా, డైరెక్ట్ గా మెయిల్ విండో లోనే, తెలుగు లో టైపు చెయ్యవచ్చు. http://mail.google.com/support/bin/answer.py?hl=en&answer=139576).
http://t13n.googlecode.com/svn/trunk/blet/docs/help_te.html#Store

వర్డ్ డాకుమేంట్ లో తెలుగు ని దాచుకోవడం:
మీరు విండోస్ విస్టా వాడుతున్నట్లయితే, తెలుగు కి సపోర్ట్ దానితోనే వస్తుంది. విండోస్ ఎక్స్ పీ లో ఐతే మాత్రం కాంప్లెక్స్ స్క్రిప్ట్ లని ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలో ఇక్కడ వివరం గా ఉంది: http://employees.org/~praveeng/files/telugudisplay/TeluguEnableScreenShots.htm

లిపులు –లిప్యంతరీకరణ.
అక్షర రూపాల్ని ఫాంట్లు అంటారు. బిట్‌మాప్ (Bit Map), ట్రూ టైప్ (True Type) , ఓపెన్ టైప్ (Open Type)ముఖ్యమైన రకాలు. Akshar Unicode, Code2000 , Gautami, Pothana , RaghuTelugu , Saraswati5, Vemana2000.http://www.wazu.jp/gallery/Fonts_Telugu.html
RTS ,Unicode , ISCII , ITRANS , TSCII , TAB & TAM, ఈనాడు ఫాంటు, వార్తా ఫాంటు, శ్రీలిపి , ఐ-లీప్ , అనుపమ వగైరా వగైరా. ఇలా ఒకటా రెండా, బోల్డన్ని ఫాంట్లు . కానీ ఇప్పుడు యూనీకోడ్ ప్రపంచభాషల్లో చాలావాటికి ప్రామాణికాలేర్పరిచింది. వెన్ననాగార్జున గారు (vnagarjuna@gmail.com) ఫాంట్లన్నిటినీ యూనీకోడ్ కి మార్చేలాగా పద్మ ఉపకరణం తయారుచేశారు. పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్ కి మార్చగల
సామర్థ్యానికి ఎదిగింది. http://padma.mozdev.org/.
ఈమాట - Non-Unicode Font to Unicode Converter --

http://eemaata.com/font2unicode/index.php5

Anu veekshanam,Anu rahamthulla version,Anu ATA souvenir version,Anu rangesh kona version,Tikkana  లాంటి కొన్నిఅను ఫాంట్ల  సమశ్య సురేష్ కొలిచాల (suresh.kolichala@gmail.com) గారివల్ల తీరింది.ఇంకా సాక్షి(SW908.TTF), సూరి, కొత్త అను ఫాంట్లు,యూనికోడ్ లోకి  మార్చాలి . ఫాంట్లపై  పేటెంట్ రైట్లు గల వ్యాపార సంస్థలవారు ఆయా ఫాంట్లను అందరినీ ఉచితంగా వాడుకోనిస్తే ,యూనికోడ్ లోకి మార్చనిస్తే తెలుగు భాషకు సేవ చేసినవారవుతారు.

అనువాద ఉపకరణం
http://docs.google.com/support/bin/static.py?page=faq.html&hl=te
మాన్యువల్ గా తర్జుమా చేయడం కంటే,దీంతో పని తగ్గుతుంది. పైగా విదేశాల్లో, భాషరాని వారికి ఇది బాగా అక్కరకొస్తుంది. ప్రయత్నించి చూడండి. గూగుల్ పత్రాల లో ఎన్ని భాషల్లోకి అనువదించవచ్చో కనబడుతుంది.ఇంకా తెలుగుకి ఇందులో సపోర్ట్ లేదు, త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.



ఇవికూడాచూడండిః
•    ఈటీవీ2లో 20.5.2007న "తెలుగు-వెలుగు " కార్యక్రమం లో నా ఇంటర్ వ్యూ http://telugu.fliggo.com/video/GcLNlAgS
•    తెలుగు భాష - చర్చా వేదిక వ్యాసం “ఇలా చేస్తే బాగుంటుంది “విపుల నవంబర్ 2007 http://eenadu.net/vipnew3/display.asp?url=vip-kathalu13.htm

                                 నూర్ బాషా రహంతుల్లా డిప్యూటీ కలెక్టర్ విజయవాడ .

భ్హాష పట్ల మక్కువతో ఎనలేని కృషి సలుపుతున్న శ్రీ నూర్ బాషా రహంతుల్లా గారికి ఇంత విలువైన సమాచారాన్ని నాకు అందించినందుకు హృదయపూర్వక నమస్కారములు.

7 వ్యాఖ్యలు:

suresh చెప్పారు...
chala baga rasaru.kani chinna sumdeham madam......
emadye kottaga blog create chesanu,kani background lo beautiful themes yela set cheyalo cheppandi please......
అజ్ఞాత చెప్పారు...
చాలా ఉపయోగకరంగా ఉంది. ధన్యవాదములు.
అజ్ఞాత చెప్పారు...
What if Idon't see the regional and languages option in control panel
Tekumalla Venkatappaiah చెప్పారు...
Chala bagundi. Ee madhya Saakshi Vijayawada lo publish ayina e-Telugu news item kooda chala bagundi. Dhanya vaadamulu.
Miriyala Aravind చెప్పారు...
ఇవి మాతో పంచుకున్నందుకు ధన్యవాదములు
- మీకు మరియు రహంతుల్లా గారికి
Raj చెప్పారు...
చాలా వివరముగా చెప్పారు.. మీకు నా కృతజ్ఞతలు.
Sudha చెప్పారు...
కంప్యూటర్ లో తెలుగు స్థాపన నేను చాలాసార్లు చేసినా...ఎవరైనా అడిగేసరికి మళ్ళీ లింక్స్ వెతుకుతుంటాను.
అలాగే ఇక్కడి కి వచ్చాను..
మీరు రాసిన విధానంలో ఒక అంశం వదిలేసారు.

4 వ స్టెప్ పూర్తయిన తర్వాత విండోస్ ఎక్స్ పి సిడి ని అడుగుతుంది. ఆ సిడి పెట్టాక అవసరమైన ఫైల్స్ కాపీ అయిన తర్వాత రీస్టార్ట్ అడుగుతుంది.
అందువలన ఎక్స్ పీ సీడీ సిద్ధంగా ఉంచుకుంటేనే కానీ ఈ పని పూర్తవదు.

అంతేకాదు...రీస్టార్ట్ చేసాక కూడా కంట్రోల్ పేనల్ లోకి వెళ్ళి మళ్ళీ రీజినల్ లాంగ్వేజెస్ లోకి వెళ్ళి ఈసారి మొదట కనిపించే రీజినల్ ఆప్షన్స్ లో డ్రాప్ డౌన్ మెనూ లో లిస్ట్ లో తెలుగు కనిపిస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై అనాలి. అప్పుడు ఇక కంప్యూటర్ లో తెలుగు ఎంచక్కా కనిపిస్తుంది.
ముఖ్యంగా తెలుగు టైప్ చేయాలంటే ఈ పూర్తి పద్ధతి అనుసరించవలసిందే.


ఆపరేటింగ్ సిస్టమ్ లలో తెలుగును స్ధాపించడం:
1. స్టార్ట్ మెనూ లో Settings > Control Panel కి వెళ్ళండి
2. Control Panel లో Regional and Language Options ని ఎంచుకోండి
3. Languages టాబ్ కి వెళ్ళి అక్కడ Install files for complex script and right-to-left languages (including Thai) అనే చెక్ బాక్సుని ఎంచుకోండి.
4. Apply అనే మీట ని నొక్కండి.
5. Do you want to restart your computer now? అన్నప్పుడు Yes అనే మీటని నొక్కండి.మీ కంప్యూటర్ రీబూట్ అయ్యిన తరవాత తెలుగు చక్కగా కనిపిస్తుంది.

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య

NARAYANA STOTRAM_శ్రీ నారాయణ స్తోత్రమ్ రచన: ఆది శంకరాచార్య https://drive.google.com/file/d/1ZUIkG_ZAvisZWy2oPsOVH6o3c2ReuzlA/view?usp=drivesdk

Popular